రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్లో మంచిర్యాల క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు విచ్చేసి శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ఆయన చేతుల మీదుగా రక్తదాన ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఇంతటి ఉన్నతమైన సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్లబ్ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ రక్తదాన శిబిరంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ సాయినీ స్రవంతి - కిషోర్, క్లబ్ అధ్యక్షులు వెంకట రమణారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కోశాధికారి నర్సింగరావు పాల్గొన్నారు. వీరితో పాటు క్లబ్ ఉపాధ్యక్షులు జితేందర్ రావు, కొత్త రాజేశం, శశిపాల్ రెడ్డి, కార్యదర్శులు వడ్డే రాజమౌళి, జుర్రు నగేష్, కల్వల జగన్ మోహన్ రావు, నల్ల శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి సత్యపాల్ రెడ్డి, మరియు పలువురు ముఖ్య నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు