BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

రోడ్డు విస్తరణ శంకుస్థాపన సభను విజయవంతం చేయాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Jul, 2026 - 08:02 PM
308 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా చిట్యాల నుండి భువనగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన సభను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ పిలుపునిచ్చారు. ​ఈ సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రూ. 240 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ రోడ్డు విస్తరణ పనులు జరగనున్నట్లు వారు తెలిపారు. యాదాద్రి జిల్లా​ రామన్నపేటలో జరగబోయే ఈ రోడ్డు విస్తరణ పనుల పైలాన్ శంకుస్థాపన కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి అని. కోరారు.​ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఉదయం 9:00 గంటలకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రయాణ సౌకర్యాలను పెంపొందించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. ఈ రోడ్డు విస్తరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి పనులకు సహకరించి, శంకుస్థాపన సభను ఇదేంతం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మియు సైదులు, కౌన్సిలర్లు బొబ్బలి సందీపా రాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, ఎస్.కె ఇబ్రహీం, , ఇమ్రాన్ , కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు,,  జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోకల దేవదాస్,  కాంగ్రెస్ నాయకులు చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మల్లయ్య,, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ, మాజీ కౌన్సిలర్ సిలివేరు శేఖర్, దిశపాక రాజేష్, జిట్ట శేఖర్ , తదితరులు పాల్గొన్నారు..