ఏపీలో చెత్తతో బయో గ్యాస్.. 5 ప్లాంట్ల ఏర్పాటు
ఏపీలో చెత్తతో బయో గ్యాస్.. 5 ప్లాంట్ల ఏర్పాటు
అమరావతి :పట్టణాల్లో పెరుగుతున్న ఘన వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో సేకరించే చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.
రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు నగరాల్లో కొత్త బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్ను ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.59.85 కోట్లు మంజూరు చేసింది.
ప్రతి ప్లాంట్ రోజుకు సుమారు 25 టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించబడనుంది. ఈ చర్యల ద్వారా నగరాల్లో చెత్త సమస్య తగ్గడమే కాకుండా పర్యావరణానికి హాని చేయని ఇంధనం ఉత్పత్తి అవుతుంది.
అదేవిధంగా, స్వచ్ఛమైన శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, నగరాభివృద్ధికి ఇది మరో ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.