www.ntodaynews.com
రూ.5,756 కోట్లతో 117 పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జాతీయం
న్యూఢిల్లీ, జూలై 22: దేశవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.5,756.62 కోట్ల వ్యయంతో 117 పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టులు వివిధ కేంద్ర పథకాల కింద అమలు కానున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, సందర్శకుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి, వారసత్వ ప్రాంతాల పరిరక్షణ, ఆధునిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, పర్యాటక రంగానికి ఊతం లభించి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా భారతదేశాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.