www.ntodaynews.com
ఒంగోలు–నంద్యాల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పరిధిలోని ఒంగోలు–నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు చాణక్య స్కూల్ సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని రాంగ్ రూట్లో వచ్చిన మారుతి కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.