www.ntodaynews.com
ఏపీలో క్రీడా రిజర్వేషన్లకు కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు వర్తించే రిజర్వేషన్ల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
ఇకపై 3% క్రీడా రిజర్వేషన్ ప్రయోజనం పొందాలంటే, అభ్యర్థులు సంబంధిత శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షల్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతేడాది ప్రభుత్వం క్రీడాకారులకు ఉన్న రిజర్వేషన్లను 2% నుంచి 3%కు పెంచిన విషయం తెలిసిందే. తాజా సవరణలతో ప్రతిభతో పాటు అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా తప్పనిసరి అయింది.