ఏపీలో మిలాద్-ఉన్-నబీ సెలవు తేదీ మార్పు.. ఆగస్టు 26న సాధారణ సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్-ఉన్-నబీ పండుగ సాధారణ సెలవు తేదీలో మార్పు చేసింది. గతంలో ప్రకటించిన ఆగస్టు 25, 2026 (మంగళవారం) సెలవును మార్చి, ఆగస్టు 26, 2026 (బుధవారం)ను సాధారణ సెలవు దినంగా ఖరారు చేసింది.
చంద్రదర్శనం ఆధారంగా ఇస్లామిక్ క్యాలెండర్లోని రబీ ఉల్ అవ్వల్ నెల తేదీలో మార్పు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ విజ్ఞప్తి మేరకు సెలవు తేదీని సవరించారు.
ఇప్పటికే 2025 డిసెంబర్ 4న జారీ చేసిన జీఓ ఆర్.టి. నెం.2276కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12వ రబీ ఉల్ అవ్వల్ (మిలాద్-ఉన్-నబీ) ఆగస్టు 26న రావడంతో ఆ రోజును ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవుగా ప్రకటించారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) జె. శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు.
పాత సెలవు తేదీ: ఆగస్టు 25, 2026 (మంగళవారం)
కొత్త సెలవు తేదీ: ఆగస్టు 26, 2026 (బుధవారం)