www.ntodaynews.com
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. విజయవాడలో 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. విజయవాడలో 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో మరో కోవిడ్ కేసు నమోదైంది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక జ్వరంతో ఆసుపత్రికి రావడంతో వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఆమెకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.
బాలికను వెంటనే ఆసుపత్రిలోని కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కోవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ప్రజలకు సూచించారు.