BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ఏపీలో మరో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. విజయవాడ-గుంటూరు మధ్య భారీ ప్రాజెక్ట్‌!

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:28 PM
58 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

తాడికొండ మండలం రావెల సమీపంలో ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనువైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తం 4,618 ఎకరాల్లో విమానాశ్రయం అభివృద్ధి చేయాలని భావిస్తుండగా, తొలి దశలో 2,648 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపట్టే అవకాశముంది.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్ని తరలించాల్సిన పరిస్థితి రాకుండా స్థల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. భూసమీకరణ, భూసేకరణ ప్రక్రియలపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్ తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.3,409 కోట్ల పెట్టుబడి అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4 వేల మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో భారీ రన్‌వే నిర్మించనున్నారు.

ఈ ఎయిర్‌పోర్ట్‌ పూర్తయితే విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలకు గ్లోబల్ కనెక్టివిటీ పెరగడంతో పాటు పెట్టుబడులు, ఐటీ, పారిశ్రామిక రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.