BREAKING
ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య
www.ntodaynews.com

ఏపీలో మరో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. విజయవాడ-గుంటూరు మధ్య భారీ ప్రాజెక్ట్‌!

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:28 PM
16 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

తాడికొండ మండలం రావెల సమీపంలో ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనువైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తం 4,618 ఎకరాల్లో విమానాశ్రయం అభివృద్ధి చేయాలని భావిస్తుండగా, తొలి దశలో 2,648 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపట్టే అవకాశముంది.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్ని తరలించాల్సిన పరిస్థితి రాకుండా స్థల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. భూసమీకరణ, భూసేకరణ ప్రక్రియలపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్ తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.3,409 కోట్ల పెట్టుబడి అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4 వేల మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో భారీ రన్‌వే నిర్మించనున్నారు.

ఈ ఎయిర్‌పోర్ట్‌ పూర్తయితే విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలకు గ్లోబల్ కనెక్టివిటీ పెరగడంతో పాటు పెట్టుబడులు, ఐటీ, పారిశ్రామిక రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.