BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఏపీలో మరో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. విజయవాడ-గుంటూరు మధ్య భారీ ప్రాజెక్ట్‌!

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:28 PM
98 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

తాడికొండ మండలం రావెల సమీపంలో ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనువైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తం 4,618 ఎకరాల్లో విమానాశ్రయం అభివృద్ధి చేయాలని భావిస్తుండగా, తొలి దశలో 2,648 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపట్టే అవకాశముంది.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్ని తరలించాల్సిన పరిస్థితి రాకుండా స్థల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. భూసమీకరణ, భూసేకరణ ప్రక్రియలపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్ తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.3,409 కోట్ల పెట్టుబడి అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4 వేల మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో భారీ రన్‌వే నిర్మించనున్నారు.

ఈ ఎయిర్‌పోర్ట్‌ పూర్తయితే విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలకు గ్లోబల్ కనెక్టివిటీ పెరగడంతో పాటు పెట్టుబడులు, ఐటీ, పారిశ్రామిక రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.