www.ntodaynews.com
ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ 76.36% పూర్తి.. 4.16 కోట్లలో 3.17 కోట్ల ఓట్లు నమోదు
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు 76.36 శాతం పురోగతి నమోదైంది. ఇంటింటి సర్వే ప్రారంభానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 4.16 కోట్ల ఓట్లలో 3.17 కోట్ల ఓట్లు ఇప్పటికే మ్యాపింగ్ పూర్తయ్యాయి.
ఇంకా 98.39 లక్షల ఓట్లు మ్యాపింగ్ కాని స్థితిలో ఉండగా ఇవే కీలకంగా మారాయి. జిల్లాల వారీగా చూస్తే అనకాపల్లి జిల్లా 89.38 శాతం మ్యాపింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. నెల్లూరు జిల్లా 66.55 శాతంతో చివరి స్థానంలో ఉంది.
రాష్ట్ర సగటు కంటే తక్కువ మ్యాపింగ్ నమోదైన నియోజకవర్గాలు 86గా ఉండగా, మాడుగుల నియోజకవర్గం 94.58 శాతం మ్యాపింగ్తో తొలి స్థానాన్ని సాధించింది.