BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఏపీలో పక్కా ఇళ్లు, గ్రామీణ రహదారులకు రూ.422 కోట్ల నిధులు: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
61 వీక్షణలు

దేశంలో ఎవరూ పూరిళ్లలో నివసించకుండా ప్రతి కుటుంబానికి సొంత పక్కా ఇల్లు కల్పించాలన్నది ప్రధాని సంకల్పమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 74,212 పక్కా ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను 146 కొత్త రహదారులతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.422 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ముక్కావారిపల్లెలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి వెనకడుగు ఉండదని, అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, పక్కా గృహాల నిర్మాణం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.