BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సంకేతాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:31 PM
130 వీక్షణలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సంకేతాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికలు తక్షణం నిర్వహించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వేసవి సెలవుల్లోపు ఎన్నికలు నిర్వహించబోమని అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీనివాస్ కోర్టుకు స్పష్టం చేశారు.

బీసీ జనగణన పూర్తి కాకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదంటూ దాఖలైన పిటిషన్‌పై నిన్న విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన AG, బీసీల సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సర్వే పూర్తవడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని వివరించారు.

సర్వే అనంతరం బీసీ రిజర్వేషన్ల శాతం విషయంలో కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని, అందువల్ల సమీప కాలంలో సర్పంచ్ ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు.

దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.