BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సంకేతాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:31 PM
69 వీక్షణలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సంకేతాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికలు తక్షణం నిర్వహించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వేసవి సెలవుల్లోపు ఎన్నికలు నిర్వహించబోమని అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీనివాస్ కోర్టుకు స్పష్టం చేశారు.

బీసీ జనగణన పూర్తి కాకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదంటూ దాఖలైన పిటిషన్‌పై నిన్న విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన AG, బీసీల సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సర్వే పూర్తవడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని వివరించారు.

సర్వే అనంతరం బీసీ రిజర్వేషన్ల శాతం విషయంలో కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని, అందువల్ల సమీప కాలంలో సర్పంచ్ ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు.

దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.