ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్లైన్ విధానం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్లైన్ విధానం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచే లక్ష్యంతో ఓటర్ల జాబితాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది.
స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఓటర్ల జాబితాలను పొందుపరిచి, వాటి ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేసే విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే రిజర్వేషన్ల ఖరారులో రాజకీయ జోక్యం, లాబీయింగ్లకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రతి దశలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ల ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.