BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్‌లైన్ విధానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:18 PM
58 వీక్షణలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్‌లైన్ విధానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచే లక్ష్యంతో ఓటర్ల జాబితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఓటర్ల జాబితాలను పొందుపరిచి, వాటి ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేసే విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే రిజర్వేషన్ల ఖరారులో రాజకీయ జోక్యం, లాబీయింగ్‌లకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రతి దశలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.