BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం.. ఏర్పాట్లు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
5 వీక్షణలు

ఎన్నికల నిర్వహణపై శాఖలకు స్పష్టమైన ఆదేశాలు.. న్యాయపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి

123 పట్టణ స్థానిక సంస్థలు.. 13,351 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియకు కసరత్తు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పాలకవర్గాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. 

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగానే అన్ని అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా కోర్టుల్లో ఉన్న కేసులు, న్యాయపరమైన వివాదాలు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల సామగ్రి సమీకరణపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. పోలింగ్‌కు అవసరమైన వస్తువులు, పరికరాల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలు, 13,351 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల జాబితాలు, వార్డుల వివరాలు, రిజర్వేషన్లు, ఇతర పరిపాలనా అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కొత్త పాలకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.