ఏపీలో తల్లికి వందనం' డబ్బులు కావాలంటే ఇదో కీలక నిబంధన.. ఇలా చేయకపోతే నిధులు నిలిపివేత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు ముందు లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం (ఆధార్ సీడింగ్) తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
గతంలో ఆధార్ లింక్ లేకపోవడంతో పలువురు అర్హులు పథకం ప్రయోజనాలను పొందలేకపోయిన నేపథ్యంలో, ఈసారి ముందుగానే బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
లబ్ధిదారులు తమ బ్యాంకు శాఖకు వెళ్లి ఆధార్ సీడింగ్ ఫారం సమర్పించడం ద్వారా లేదా అధికారిక UIDAI పోర్టల్లో ఓటీపీ ద్వారా ఆధార్ లింక్ స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు.
జులై 10లోపు ఆధార్ సీడింగ్ పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లోనే 'తల్లికి వందనం' పథకం నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. దీంతో లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంకు ఖాతా-ఆధార్ అనుసంధానాన్ని ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు.