BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఏపీలో తల్లికి వందనం' డబ్బులు కావాలంటే ఇదో కీలక నిబంధన.. ఇలా చేయకపోతే నిధులు నిలిపివేత!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
77 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు ముందు లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం (ఆధార్ సీడింగ్) తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

గతంలో ఆధార్ లింక్ లేకపోవడంతో పలువురు అర్హులు పథకం ప్రయోజనాలను పొందలేకపోయిన నేపథ్యంలో, ఈసారి ముందుగానే బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

లబ్ధిదారులు తమ బ్యాంకు శాఖకు వెళ్లి ఆధార్ సీడింగ్ ఫారం సమర్పించడం ద్వారా లేదా అధికారిక UIDAI పోర్టల్లో ఓటీపీ ద్వారా ఆధార్ లింక్ స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

జులై 10లోపు ఆధార్ సీడింగ్ పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లోనే 'తల్లికి వందనం' పథకం నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. దీంతో లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంకు ఖాతా-ఆధార్ అనుసంధానాన్ని ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు.