www.ntodaynews.com
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి
అనకాపల్లి జిల్లాలో అవినీతి అధికారిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న పెదతీనార్ల వీఆర్వో చిట్టిబాబు రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
పొలం పాస్ పుస్తకం జారీ చేసేందుకు బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో వీఆర్వో చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం వీఆర్వోను అధికారులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.