ఐఫోన్ కొత్త మోడళ్లు
ఐఫోన్ కొత్త మోడళ్లు
Ntoday News / బిజినెస్:
గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్లతోపాటు తొలిసారి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను ఆవిష్కరించింది. గెలాక్సీ జీ ఫోల్డ్ 8 తరహాలోనే మూసి ఉన్నప్పుడు సాధారణ ఫోన్లా, తెరిచినప్పుడు ఐప్యాడ్ లాంటి పెద్ద డిస్ప్లతో కనిపించే ఈ డివైజ్, ఐఫోన్ చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి రెండు యాప్లను పక్కపక్కనే వాడే మల్టీ టాస్కింగ్ సదుపాయంతో వచ్చింది. 256జీబీ బేస్ స్టోరేజ్, టచ్ఐడీ, రోజంతా పనిచేసే బ్యాటరీ, 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్లున్నాయి. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం బాడీతో స్టార్ వైట్, నైట్ స్కె రంగుల్లో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 2,99,900గా నిర్ణయించారు. అక్టోబర్ 16 నుండి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని, అక్టోబర్ 23 నుండి అమ్మకాలు మొదలవుతాయి. శక్తివంతమైన 2ఎన్ఎం-జనరేషన్ 'ఏ20 ప్రో' ప్రాసెసర్తో పాటు, యాపిల్ స్వయంగా తయారు చేసిన 'సీ2' మోడము వీటిలో పొందుపరిచారు. ప్రో మోడల్ 6.3-అంగుళాలు, ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల డిస్ప్లేతో వస్తున్నాయి. ఐఫోన్ 18 ప్రో రూ. 1,64,900కి లభిస్తుండగా, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రూ. 1,79,900 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 12ను రూ.56,900కు, వాచ్ ఆల్ట్రా 4ను రూ. 1,09,900కు, ఎయిర్ పాడ్స్ 5ను రూ.14,900కు విడుదల చేశారు.