www.ntodaynews.com
అక్టోబర్ లేదా నవంబర్లో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
అక్టోబర్ లేదా నవంబర్లో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ : ఎమ్మెల్యే బోండా ఉమా
విజయవాడ | రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు.
అర్హులైన వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుందని బోండా ఉమా వెల్లడించారు.