www.ntodaynews.com
అమరావతి : జగన్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది : మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్ల అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ఇతరులకు నీతులు చెప్పే స్థాయిలో జగన్ వ్యవహరించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్కు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఇప్పుడు రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.