BREAKING
ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం కొమ్మినేని సూపర్ స్పెషలిటీ హాస్పటల్ సౌజన్యంతో నియోజకవర్గం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026 ఏపీలో బగ్గుమంటున్న ఎండలు ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు మదనపల్లె లో ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన బాధితులు... చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఇండో – కివీస్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎవరికి ప్రయోజనకరం? అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం కొమ్మినేని సూపర్ స్పెషలిటీ హాస్పటల్ సౌజన్యంతో నియోజకవర్గం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026 ఏపీలో బగ్గుమంటున్న ఎండలు ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు మదనపల్లె లో ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన బాధితులు... చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఇండో – కివీస్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎవరికి ప్రయోజనకరం? అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు
www.ntodaynews.com

అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
28 May, 2026 - 12:48 PM
78 వీక్షణలు

భారీ ప్రాజెక్టుల వెనుక వలస కార్మికుల దుర్భర జీవితం

– పి. అజయ కుమార్‌, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూటమి ప్రభుత్వం నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు, హోటళ్లు తదితర ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, పెట్టుబడులు, నిర్మాణాల పురోగతి గురించి అధికారిక ప్రకటనలు వెలువడుతున్నాయి.

ముఖ్యంగా అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టు, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

అయితే ఈ నిర్మాణాల వెనుక వేలాది మంది వలస కార్మికుల శ్రమ ఉన్నప్పటికీ, వారి జీవన పరిస్థితులు మాత్రం ఎవరి దృష్టికీ చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే ఎక్కువగా ఈ నిర్మాణాల్లో పనిచేస్తున్నారు. కానీ వారి వేతనాలు, పని గంటలు, ఆరోగ్య సదుపాయాలు, నివాస పరిస్థితులపై ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలు ఎలాంటి సమీక్షలు నిర్వహించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని సందర్శించే ముందు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ పార్థసారథి కార్మికుల నివాస ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రపంచ బ్యాంకు బృందం కూడా ఆ ప్రాంతాలను సందర్శించి అక్కడి సౌకర్యాల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

కార్మికుల నివాస ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని, టాయిలెట్లు పరిశుభ్రంగా లేవని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆరోపిస్తున్నారు. పాచి పట్టిన నీటితో బహిరంగంగా స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొంటున్నారు.

నిర్మాణ రంగంలో పనిచేస్తున్న హెల్పర్లకు నెలకు సుమారు రూ.15 వేల వరకు, మేస్త్రీలు, సూపర్‌వైజర్లకు రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనాలు ఇస్తున్నప్పటికీ, ఆ మొత్తాన్ని పొందేందుకు రోజుకు 12 గంటలపాటు పని చేయాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. చట్టప్రకారం 8 గంటల పని తర్వాత డబుల్ ఓటీ ఇవ్వాల్సి ఉన్నా, అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు.

కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్ఐ వంటి ప్రాథమిక హక్కులు కూడా అందడం లేదని విమర్శలు ఉన్నాయి. పెద్ద నిర్మాణ సంస్థల ఇతర ప్రాజెక్టుల నుంచి వచ్చిన కొంతమందికి మాత్రమే పీఎఫ్‌ కొనసాగుతోందని, మిగిలిన వారికి ఎలాంటి భద్రత లేదని చెబుతున్నారు. కుటుంబాలతో కలిసి ఉండేందుకు కూడా అవకాశాలు కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి నిర్మాణాల్లో ఎల్‌అండ్‌టి, షాపూర్జీ పల్లోంజీ, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ, మేఘా ఇంజినీరింగ్‌, కెపిసి ప్రాజెక్ట్స్‌, బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా తదితర భారీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవి నేరుగా కార్మికులను నియమించకుండా కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించుకుంటున్నాయని, దీంతో బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, కార్మికులకు కనీస హక్కులు కూడా కల్పించడం లేదని విమర్శిస్తున్నారు. కంపెనీల మార్కెట్ విలువలు, లాభాలు పెరుగుతున్నా, కార్మికుల జీవితం మాత్రం మారడం లేదని సిఐటియు నేతలు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో కార్మిక చట్టాల అమలు దాదాపుగా నిలిచిపోయిందని, లేబర్ శాఖ తనిఖీలు జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు మరింత వేగంగా అనుమతులు ఇవ్వడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శిస్తున్నారు.

గత రెండు దశాబ్దాలుగా అనేక రంగాల్లో కనీస వేతనాలు సవరించకపోవడం, కాంట్రాక్ట్ కార్మికులకు 2011 తర్వాత వేతన సవరణలు జరగకపోవడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే, అమరావతిలో కూడా కార్మికులు ఐక్యంగా పోరాటాల్లోకి దిగితేనే వేతనాలు, పని పరిస్థితుల్లో మార్పు సాధ్యమవుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. అజయ కుమార్‌ అభిప్రాయపడ్డారు.