అల్లిపల్లి బోర్డింగ్ హోమ్లో నూతన సౌకర్యాల ప్రారంభం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి బోర్డింగ్ హోమ్లో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన బెడ్స్తో పాటు డిజిటల్ రూమ్స్ను చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. క్రాంతి కుమార్ ప్రారంభించారు.
ఫాదర్ మరియజోజి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలు విద్యార్థులకు మరింత మెరుగైన వసతి, ఆధునిక విద్యా వాతావరణాన్ని అందించనున్నాయి. ఈ సందర్భంగా బోర్డింగ్ హోమ్లోని సౌకర్యాలను పరిశీలించిన సీఐ క్రాంతి కుమార్, విద్యార్థుల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అల్లిపల్లి పుణ్యక్షేత్ర డైరెక్టర్, విచారణ గురువు ఫాదర్ మరియజోజి, గురువులు, కన్యాస్త్రీలు, బోర్డింగ్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక, ఆత్మీయ వాతావరణంలో జరిగింది.