www.ntodaynews.com
అమరావతిలో భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో భూ సమీకరణకు పెండింగ్లో ఉన్న భూముల రైతులు ముందుకొచ్చారు. ఒకే రోజు 106 ఎకరాల భూమిని భూ సమీకరణకు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతూ రైతులు సీఆర్డీఏకు లేఖలు అందజేశారు.
రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూ సమీకరణకు తమ సమ్మతి ప్రకటించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం కావాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
వెలగపూడికి చెందిన రంగారావు కుటుంబ సభ్యులు మాత్రమే 60 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ఇవ్వడానికి అంగీకరించడం విశేషం. మిగిలిన భూములను ఇతర రైతులు సమీకరణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రైతుల తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.