www.ntodaynews.com
అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతాం : మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్
అమరావతి : ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత, పచ్చదనం, ప్రజలకు అనువైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అసెంబ్లీ భవనాన్ని రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీలకు సరిపోయే విధంగా అసెంబ్లీ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆధునిక వసతులతో పాటు పర్యావరణహిత నిర్మాణ విధానాలను అమలు చేస్తూ అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.