www.ntodaynews.com
అంబేద్కర్ జయంతి సందర్భంగా 14న పుంగనూరులో ర్యాలీ
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అంబేద్కర్ జయంతి సందర్భంగా 14న పుంగనూరులో ర్యాలీ
రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఐక్యవేదిక నాయకుడు సుమిత్రా రమణ తెలిపారు.
పుంగనూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద సంఘ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని తూర్పు మోగసాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.