BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

అంబులెన్స్ లేక.. బైక్‌పైనే మృతదేహం తరలింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 11:49 AM
158 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌ | అన్నమయ్య జిల్లా:

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్‌(30)కు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో స్నేహితులు బైక్‌పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు స్నేహితులు ఆటో డ్రైవర్లను కోరినా.. ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. దీంతో చేసేదేమీ లేక వెంకటేష్ మృతదేహాన్ని బైక్‌పైనే గ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. 

కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాద ఛాయలు నింపాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.