www.ntodaynews.com
అంబులెన్స్ లేక.. బైక్పైనే మృతదేహం తరలింపు
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ | అన్నమయ్య జిల్లా:
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్(30)కు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో స్నేహితులు బైక్పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు స్నేహితులు ఆటో డ్రైవర్లను కోరినా.. ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. దీంతో చేసేదేమీ లేక వెంకటేష్ మృతదేహాన్ని బైక్పైనే గ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాద ఛాయలు నింపాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.