BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 31 August 2026, 08:08 pm
Posted by : కూనురు మధు

అంచనాల కమిటీ చైర్మన్‌గా కోరం కనకయ్య బాధ్యతల స్వీకరణ

తెలంగాణ
/ హైదరాబాద్
31 Aug, 2026 - 08:08 PM
10 వీక్షణలు

అంచనాల కమిటీ చైర్మన్‌గా కోరం కనకయ్య  బాధ్యతల స్వీకరణ

 ప్రజా అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి.. నిధుల సద్వినియోగమే లక్ష్యం

తెలంగాణ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బాధ్యతలు స్వీకరించారు. శాసనసభ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అధ్యక్షతన అంచనాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథులుగా హాజరై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులు, వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ అంచనాలు–వ్యయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజా అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ నిధుల సద్వినియోగమే తన ప్రధాన లక్ష్యమని అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య పేర్కొన్నారు.

సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, సుదీర్ రెడ్డి, ఎమ్మెల్సీ యదవ రెడ్డితో పాటు శాసనసభ, శాసన మండలి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.