విజయవాడలో ఎంపీ చిన్ని కార్యాలయంలో టీడీపీ నేతల భేటీ..
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడలో ఎంపీ చిన్ని కార్యాలయంలో టీడీపీ నేతల భేటీ.. తిరువూరు జామియా మసీద్ అధ్యక్షుడికి అభినందనలు
ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరువూరు జామియా మసీద్ అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ హుస్సేన్కు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు రేగళ్ల వీరారెడ్డి, ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ (ఎంఆర్కే), టీడీపీ నాయకులు కాజా రవి తదితరులు పాల్గొన్నారు.