అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు: 17 బైకులు స్వాధీనం, ఎనిమిది మందిపై కేసు నమోదు
నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాల పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., గారు ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఘటన వివరాలు:
గత రెండు సంవత్సరాలుగా ఈ ముఠా పల్సర్ బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోంది. దొంగిలించిన బైకులను తక్కువ ధరకు రిసీవర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మార్చి 17 సాయంత్రం నవీపేట్ మండలం అయ్యప్ప టెంపుల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
రికవరీ: నిందితుల వద్ద నుండి సుమారు 17 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసులు: బాసర, ముధోల్, భైంసా, తానూర్, నవీపేట్, మాక్లూర్, రెంజల్, వర్ని స్టేషన్ల పరిధిలో నమోదైన 15 కేసులను పోలీసులు ఛేదించారు.
నిందితులు: ఈ కేసులో షేక్ అర్బాజ్, షేక్ అరిబ్ సహా మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో కొందరు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు.
పోలీసులకు అభినందనలు:
కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ప్రకాష్ యాదవ్, ముస్తాక్ అలీ, నార్త్ రూరల్ సి.ఐ బి. శ్రీనివాస్, నవీపేట్ ఎస్.ఐ కె. శ్రీకాంత్ మరియు సిబ్బందిని సిపి అభినందించారు.