www.ntodaynews.com
అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మార్కాపురం జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో, హైదరాబాద్ నుంచి గ్రామానికి అంత్యక్రియలకు కారులో బయలుదేరిన కుటుంబ సభ్యులు మాచర్ల సమీపానికి చేరుకోగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా మార్కాపురం జిల్లాకు చెందిన వారేనని అధికారులు గుర్తించారు.
ఈ విషాద ఘటనతో నాగిరెడ్డిపల్లి గ్రామంలో శోకసంద్రం నెలకొంది. అంత్యక్రియలకు వెళ్తుండగా మరో విషాదం చోటుచేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.