BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
05 Jun, 2026 - 09:12 PM
6 వీక్షణలు

చిలకలూరిపేట రూరల్:అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మురికిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలోని మిట్టమీద నివాసం ఉంటున్న షేక్ జానీ భాషా (43) చికెన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఆయనకు బీపీ పెరిగి కుడి వైపు స్వల్పంగా పక్షవాతం రావడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుఅంటించుకున్నాడు. గమనించిన చిన్న కూతురు జమీర స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2:50 గంటలకు జానీ భాషా మృతి చెందాడు. 15 ఏళ్ల మృతుడి చిన్న కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మార్చురీకి తరలించారు.