www.ntodaynews.com
అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు
అనంతపురం జిల్లాలో మరో అవినీతి ఘటన వెలుగుచూసింది. ఎగ్జిబిషన్కు అనుమతి ఇచ్చేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటూ మున్సిపల్ డీఈ లక్ష్మీనరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.
ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి ఏసీబీ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ పట్టివేత జరిగినట్లు అధికారులు తెలిపారు.