www.ntodaynews.com
అన్నదాత సుఖీభవ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడు: జూన్ 19
అన్నదాత సుఖీభవ 2026–2027 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత పథకం ద్వారా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమం జూన్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గంలోని రైతు సోదరులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రివర్యులు పిలుపునిచ్చారు.
రైతులు తమ ఖాతాల్లో నగదు జమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా చిన్న లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేసి సవరించుకోవాలని సూచించారు.
నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైతు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాత సుఖీభవ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారధి విజ్ఞప్తి చేశారు.