www.ntodaynews.com
రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం
తెలంగాణ
రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం
NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను
ఏలూరు జిల్లా/జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం వినాయక చతుర్థికి సందర్భంగా రాచన్నగూడెంలో కొత్త రామాలయం వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక మండపం వద్ద గ్రామస్తుల సహాయంతో శుక్రవారం అన్న సంతర్పణ కార్యక్రమం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ఐదు రోజులు జరుగుతాయని నేటితో మూడువ రోజు అఖండ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. శ్రీ సిద్ధి వినాయకుని కృపా కటాక్షాలు తమపై కలిగి గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ధన ధాన్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ వారు,మహిళలు,చిన్నారులు భక్తులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube