BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

AP Politics: ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం.. పార్లమెంటు వేదికగా టీడీపీ, వైసీపీ బిగ్‌ వార్‌..!

తెలంగాణ
17 Jul, 2024 - 09:11 PM
98 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్‌పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్‌ వ్యూహం సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్‌పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్‌ వ్యూహం సిద్ధం చేశారు.

ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్‌కు చేరిన పొలిటికల్‌ ఫైట్‌లో ఢిల్లీ ట్విస్ట్‌ ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టడానికి ఎంపీలందరికి రాష్ట్రంలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో ఒక డిపార్ట్‌మెంట్‌, కేంద్రం మంత్రిత్వ శాఖల్లోని ఒక డిపార్ట్‌మెంట్‌ అటాచ్‌ చేస్తారు. అలా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఒక వారధిగా ఎంపీలు వ్యవహరిస్తారు. తద్వారా అదనంగా నిధులు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జగన్‌ ధర్నాపై సమావేశంలో ప్రస్తావన రావడంతో… ఢిల్లీలో జగన్‌ ఏం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చేయాలో ముఖ్యమని నేతలకు సూచించారు చంద్రబాబు.

మరోవైపు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్‌ జగన్‌. తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్‌… ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతోన్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టి తీసుకెళ్లాలన్నారు జగన్‌. దీనిపై పార్లమెంటులో వైసీపీ గళం వినిపించాలన్నారు. ఉభయ సభల్లో ఏవిధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను దేశవ్యాప్తంగా తెలియజేయాలని జగన్ సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు.

అటు దేశ రాజధానిలో జగన్‌ ధర్నా, ఇటు పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఫైట్‌కి రంగం సిద్ధమైంది. దీంతో ఢిల్లీ పొలిటికల్‌ స్క్రీన్‌పై ఏపీ పొలిటికల్‌ సినిమా రచ్చకు కౌంట్‌డౌన్‌ షురూ అయింది.