BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 02:21 PM
37 వీక్షణలు

అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు - మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణంలోని అర్హత కలిగిన పాత్రికేయులందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . పట్టణంలోని అయ్యలూరు మరియు ఎస్.ఆర్.బి.సి ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో గృహాలను పాత్రికేయులకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు .

శుక్రవారం నంద్యాల మున్సిపాలిటీ నందు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ విలేకరులతో మాట్లాడుతూ సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలోనే పాత్రికేయుల గృహ వసతిపై ఇచ్చిన హామీ మేరకు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టిడ్కో ఇళ్లను వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయ్యలూరు మరియు ఎస్.ఆర్.బి.సి కాలనీల్లో ఉన్న గృహాలు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు అర్హులైన ప్రతి పాత్రికేయునికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు . ఈ సువర్ణ అవకాశాన్ని పాత్రికేయులందరూ సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఫరూక్ కోరారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, నంద్యాల అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ కొనియాడారు.