BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 06:47 AM
195 వీక్షణలు

డీలర్ల నుండి దందా చేస్తున్న వేలాగ్రా ఉద్యోగి పై చర్యలు తీసుకోండి..

వ్యాల్ ఆగ్రో 37 37 రకం డ్రిప్ నకిలీ ఎరువులు వారే సరఫరా చేసి మాపై కేసుల..

పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన ఎరువుల డీలర్ రాకేష్ శుక్రవారం సోమల నందు తనకు జరిగిన అన్యాయంపై మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందూరు గ్రామంలో నేను నా కుటుంబం మూడు తరాలుగా ఎరువుల వ్యాపారం చేస్తూ ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా నాణ్యమైన ఎరువులు అందిస్తు రైతుల మన్నానాలను పొందడం జరిగిందన్నారు.

గత 30సంవత్సరలుగా ఎరువులను రైతులుకు అమ్మి రైతులకు అధిక లాభాలు వచ్చే విధంగా  రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు.

 కొద్ది రోజుల కిందట నా సొంత వ్యవసాయం కోసం పలమనేరులోని ఒక డీలర్ నుండి వేలాగ్రా కంపెనీకి సంబంధించిన ఎరువులను నేను కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

ఆ ఎరువులు నకిలీవని రాయల సీమ జిల్లా వేలాగ్రా డీలర్ గా ఉన్న పుంగనూరు అన్నదాత రవి వద్ద వేలాగ్రా ఎరువుల కంపెనీ ఉద్యోగిగా పనిచేస్తున్న మురళి  మాకు తెలియజేయడం జరిగిందన్నారు.

వెంటనే నేను  పలమనేరు కు చెందిన డీలర్ ను సంప్రదించి వారిని అడగగా వేలాగ్రా కంపెనీ వారే ఆ ఎరువులు సరఫరా చేశారని మాకు తెలియజేశారు.

రైతు మా పై పిర్యాదు చేయగా అతను అతని వెంట వచ్చిన వారికీ మా షాప్ లో ఎటువంటి నకిలీ ఎరువులు దొరక్కపోయినప్పటికీ వేలాగ్రా కంపెనీ ప్రతినిధి మురళి జిల్లా డీలర్ గా ఉన్న అన్నదాత రవి ఎక్కడినుండో నకిలీ ఎరువులు తెచ్చి మా షాప్ లోనే దొరికినాయని మాపై అక్రమంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

నియోజవర్గ పరిధిలో ఉన్న డీలర్లకు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసి నకిలీ ఎరువులని డీలర్లు అందరిపై ఒత్తిడి తెచ్చి వారి నుండి లంచాల రూపంలో నగదు దండుకోవడం జరిగిందన్నారు.

ఒక సామాన్య ఉద్యోగిగా ఉన్న మురళి నకిలీ ఎరువులు డీలర్లకు విక్రయించి కోట్ల రూపాయలు దండుకొని  కోట్లాది రూపాయల ఆస్తులు కూడా  పెట్టుకోవడం జరిగిందని,దీనిపై సమగ్ర విచారణ జరిపి నకిలీ ఎరువుల బాగోతాన్ని నిగ్గు తేల్చాలని  కోరుతున్నామన్నారు.  

మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతూ మా గౌరవానికి భంగం  కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా నకిలీ ఎరువులు తయారీ వారిపై చర్యలు చేపట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.

మా షాపులో కూడా ఉన్న ఎరువులను ల్యాబ్ కు పంపించి పరిశీలించి నిజనిర్ధారణ చేయాలని నా వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నామన్నారు 

నాపై ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టిన వారిపై వెంటనే పోలీసులు సంబంధాలు అధికారులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.