ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 67 ఫిర్యాదులు స్వీకరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ
అన్నమయ్య జిల్లా | మదనపల్లి | NTODAY NEWS
మదనపల్లిలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ప్రజల నుంచి మొత్తం 67 ఫిర్యాదులను స్వీకరించారు.
స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ వివాదాలు – 26, ఆర్థిక సమస్యలు – 14, పరిపాలన సంబంధితవి – 14, కుటుంబ సమస్యలు – 5, మోసం – 3, ఘర్షణలు – 2, న్యూసెన్స్ – 2, సైబర్ నేరం – 1 ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, సైబర్ నేరాలపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
అందిన అన్ని ఫిర్యాదులపై విచారణను వేగవంతంగా పూర్తి చేసి, నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.