BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

డ్వాక్రా మహిళలకు ఉచిత ఎగ్ కార్ట్స్.. స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 12:47 PM
14 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం మరో ఉపాధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచితంగా ఎగ్ కార్ట్స్ పంపిణీ చేపట్టింది.

ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్ట్ ద్వారా గుడ్ల విక్రయ వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమంతో మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం సంపాదించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.