www.ntodaynews.com
డ్వాక్రా మహిళలకు ఉచిత ఎగ్ కార్ట్స్.. స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం మరో ఉపాధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచితంగా ఎగ్ కార్ట్స్ పంపిణీ చేపట్టింది.
ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్ట్ ద్వారా గుడ్ల విక్రయ వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంతో మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం సంపాదించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.