BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

నేటితో ముగియనున్న ఓటర్ల ఎన్యూమరేషన్.. గడువు పొడిగింపునకు లేఖ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 12:47 PM
52 వీక్షణలు

అమరావతి, జులై 14: రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించని ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 98.32 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మిగిలిన అర్హులైన ఓటర్లు కూడా తమ వివరాలను వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, జిల్లా కలెక్టర్ల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ఎన్యూమరేషన్ గడువును మరో 10 రోజులు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపించారు.

గడువు పొడిగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఇంకా ఫారం సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.