www.ntodaynews.com
అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం: సుప్రీంకోర్టులో విచారణ
జాతీయం
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారానికి సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం, సిట్ దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.