www.ntodaynews.com
కొత్త ఓటర్ల నమోదుకు కఠిన నిబంధనలు
జాతీయం
కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి ఎన్నికల ప్రక్రియలో మరిన్ని నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారుడి లేదా వారి కుటుంబ సభ్యుల పేరు గత సర్ (ఎస్ఐఆర్) ఓటరు జాబితాలో ఉండటం తప్పనిసరిగా పేర్కొనాలి.
ఫారం–6తో పాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ఓటరు లేదా బంధువు పేరు, నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా అందించాలి.
ఈ నిబంధనలు సర్–2026 ముసాయిదా ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో అమలు కానుండగా, సర్–2026 పూర్తయిన తర్వాత కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత కఠినంగా మారనున్నట్లు తెలుస్తోంది.