BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

పరిశ్రమల కాలుష్యంతో ప్రజల విలవిల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Jul, 2026 - 07:45 PM
114 వీక్షణలు

కలెక్టర్ కి వినతి పత్రం అందించిన పిట్టంపల్లి గ్రామస్తులు 

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న పిట్టంపల్లి పరిసర ప్రాంతాలలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామ పరిసరాల్లోని పలు పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ​గత కొన్ని రోజులుగా పరిశ్రమల నుంచి వస్తున్న దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన, ధూళి కారణంగా గ్రామంలో జీవనం దుర్భరంగా మారిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం ప్రభావంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, స్థానికుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని, తమ గ్రామానికి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు అని. పిట్టంపల్లి పరిసరాల్లోని పరిశ్రమల కాలుష్యంపై త్వరితగతిన విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు అని ప్రాథమిక సమాచారం.