ఆదిత్య టెక్నో స్కూల్లో నట్టల నివారణ మందుల పంపిణీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఆదిత్య టెక్నో హైస్కూల్లో విద్యార్థులకు నట్టల పురుగుల నివారణ (డీవర్మింగ్) మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, రక్తహీనత నివారణకు నట్టల నివారణ మందులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యార్థులందరికీ ఈ మందులు అందేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపతి సత్తయ్య, అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు