BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

పెద్దకాపర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Jul, 2026 - 07:46 PM
38 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య సంరక్షణలో నులిపురుగుల నివారణ మాత్రలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుల్లో రాణించగలరని, అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్  మాట్లాడుతూ విద్యార్థులలో రక్తహీనతను నివారించడానికి, వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ మాత్రలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులందరికీ ఈ మాత్రలను పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మి , శ్రీనివాస్ , పాఠశాల ఉపాధ్యాయ బృందం, వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు  పాల్గొన్నారు.