చిట్యాల హైవేపై డీజిల్ దొంగతనం : లారీలో డీజిల్ ట్యాంక్ గుల్ల
నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు కంటిమీద కునుకు వేయాలంటేనే భయపడిపోతున్నారు వాహనం పక్కన నిలిపి కాసేపు విశ్రాంతి తీసుకుందామా అంటే క్షణాల్లో డీజిల్ ట్యాంకులను గుల్ల చేస్తూ దొంగల ముఠా రెచ్చిపోతోంది. తాజాగా నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలో అర్ధరాత్రి వేళ ఒక భారీ లో డీజిల్ చోరీ కలకలం సృష్టించింది. లారీ ట్యాంక్ మూత పగులగొట్టి ఏకంగా 350 లీటర్ల డీజిల్ను దుండగులు చాకచక్యంగా దోచేశారు. బాధితుడు కథనం ప్రకారం కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ డ్రైవర్కు అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా నిద్ర వచ్చింది. దీంతో సురక్షితంగా ఉంటుందని భావించి, చిట్యాల సమీపంలోని దుర్గా హోటల్' వద్ద లారీని రోడ్డు పక్కన పార్కింగ్ చేసి క్యాబిన్లో నిద్రపోయాడు. డ్రైవర్ గాఢ నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించిన దొంగల ముఠా తక్షణమే రంగంలోకి దొంగలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం కారులో వచ్చారు అని . లారీ పక్కనే తెలియని అనుమానాస్పద కారును నిలిపి, ఐరన్ రాడ్ల సహాయంతో లారీ డీజిల్ ట్యాంక్ మూతను పగులగొట్టారు.అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పైపుల ద్వారా సుమారు 350 లీటర్ల డీజిల్ను తమ వాహనంలోకి గుంజేసి చాకచక్యంగా మాయం చేశారు అని తెలిపారు. అయితే, అక్కడ కారు అనుమానాస్పదంగా ఆగి ఉండటాన్ని గమనించిన కొందరు స్థానికులు ఆ కారు ఫోటోలను మొబైల్స్లో బంధించినట్లు సమాచారం. డ్రైవర్ నిద్ర లేచి చూసేసరికి ట్యాంక్ ఖాళీ అవ్వడం, దొంగలు అప్పటికే అక్కడి నుంచి పరారవ్వడం జరిగిపోయాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసులను బాధితుడు వేడుకుంటున్నాడు