BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

పోలవరం పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 09:34 PM
70 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడికి నర్సింగ్ కళాశాల, బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

పట్టినపాలెం, బైనేరు, గుండేరు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు బాలికల కోసం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గంలోని కీలకమైన పట్టినపాలెం, బైనేరు, గుండేరు వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం పర్యటన విజయవంతంగా సాగిందని పేర్కొన్నారు.