పోలవరం పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడికి నర్సింగ్ కళాశాల, బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
పట్టినపాలెం, బైనేరు, గుండేరు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు బాలికల కోసం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గంలోని కీలకమైన పట్టినపాలెం, బైనేరు, గుండేరు వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం పర్యటన విజయవంతంగా సాగిందని పేర్కొన్నారు.