పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు రెడ్డి వర్గం దాడిలో పలువురికి గాయాలు...
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు
... రణరంగంగా మారిన పుంగనూరు తెలుగుదేశం పార్టీ సమావేశం.
... పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు రెడ్డి వర్గం దాడిలో పలువురికి గాయాలు.
... దాడిలో తీవ్రంగా గాయపడిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ.
తిరుపతి హోటల్ గ్రాండ్ రీచ్ లో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి పుంగనూరు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు, అలాగే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, శాప్ చైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు రెడ్డి అలాగే ఇన్చార్జి రేస్ లో ఉన్న మధుసూదన్ నాయుడు, లక్ష్మీపతి రాజు తమ అనుచరులతో హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే చల్లా బాబు రెడ్డి వర్గం మధుసూదన్ నాయుడు వర్గమైన ముల్లంగి వెంకటరమణా పై అక్కడే ఉన్న గాజు ఫ్లవర్ వాస్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో వెంకటరమణాకు తల పగలడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహ లేకుండా పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడ ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం ఎలా ఉంది. అక్కడ ఉన్న చల్లా బాబు రెడ్డి అలాగే మధుసూదన్ నాయుడు అలాగే లక్ష్మీపతి రాజు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ చల్లా బాబు వర్గం మీడియాపై దాడి చేసి రికార్డ్ చేసిన వీడియోలు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్న మంత్రులు సమాధానం చెప్పాలని కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తేవడంతో సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది.