www.ntodaynews.com
పుట్టింటికి వెళ్లాలన్న భార్య.. ముక్కు కోసిన భర్త.. ప్రతీకారంగా భర్త సోదరి ముక్కు కోసిన బంధువులు
జాతీయం
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టింటికి వెళ్లాలని భార్య ప్రీతి పట్టుబట్టడంతో భర్త శ్రావణ్ ఆగ్రహానికి గురై ఆమెపై దాడి చేసి ముక్కు కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం తెలుసుకున్న ప్రీతి బంధువులు ప్రతీకారంగా శ్రావణ్ సోదరి మోనిపై పళ్లతో దాడి చేసి ఆమె ముక్కు కోసినట్లు సమాచారం. ఆదివారం తమ కజిన్ సోదరి వివాహానికి వెళ్లాలన్న విషయమే ఈ ఘర్షణకు కారణమని ప్రీతి తెలిపింది.
ఇరుపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ఇద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.