BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ముఖం చాటేసిన రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మండుతున్న ఎండలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 06:02 AM
2 వీక్షణలు

చైనాలో ఏర్పడిన "బావి" తుఫాన్ ప్రభావంతో రుతుపవన గాలుల దిశ మారినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో తేమగాలులు భారత్ వైపు వచ్చే ప్రవాహం తగ్గి, బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడినట్లు అంచనా.

ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అది ఏర్పడితే వర్షాల పరిస్థితిలో మార్పు రావచ్చని సూచిస్తున్నారు.

ఏపీలో వర్షాభావం కారణంగా పలుచోట్ల ఎండలు మళ్లీ తీవ్రంగా మారాయి. తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాల్లో ఎండలతో పాటు వడగాడ్పులు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది. మరో రెండు నుంచి మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.

తెలంగాణలో కూడా పొడి వాతావరణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జులై 15 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండగా, జులై 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ప్రస్తుతం రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్–హిస్సార్–మీరట్–గోరఖ్‌పూర్ మీదుగా దక్షిణ అస్సాం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో గంటకు 40–50 కి.మీ., తెలంగాణలో 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.