BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు ఏసీబీ నోటీసులు.. బ్యాంకు ఖాతాలు, పాన్‌ వివరాలు కోరింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 06:02 AM
72 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో అవినీతి వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. ఇటీవల నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగుల బ్యాంకు ఖాతా వివరాలు, పాన్‌ నంబర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అందించాలని ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించి, నిజామాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది.

దాడుల్లో లభించిన సమాచారంతో అక్రమ వసూళ్లు, నెలవారీ మామూళ్ల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ అంశాలపై అధికారికంగా ఏసీబీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం సంబంధిత సమాచారం సేకరణ, ప్రాథమిక పరిశీలన కొనసాగుతోంది.