BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు ఏసీబీ నోటీసులు.. బ్యాంకు ఖాతాలు, పాన్‌ వివరాలు కోరింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 06:02 AM
2 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో అవినీతి వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. ఇటీవల నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగుల బ్యాంకు ఖాతా వివరాలు, పాన్‌ నంబర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అందించాలని ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించి, నిజామాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది.

దాడుల్లో లభించిన సమాచారంతో అక్రమ వసూళ్లు, నెలవారీ మామూళ్ల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ అంశాలపై అధికారికంగా ఏసీబీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం సంబంధిత సమాచారం సేకరణ, ప్రాథమిక పరిశీలన కొనసాగుతోంది.